భారత్ హిందూ దేశం కాదు.. అమర్త్య సేన్ వ్యాఖ్యలను సమర్ధించిన సిద్ధరామయ్య

-

భారత్‌ హిందూ దేశం కాదని అమర్త్య సేన్‌ వ్యాఖ్యలను కర్నాటక సీఎం సిద్ధరామయ్య సమర్ధించారు. అవును..భారత్‌ హిందూ దేశం కాదు..భారత్‌ బహుళ సంస్కృతుల సమాహారమని, ఎన్నో వర్గాల ఐక్యతకు ప్రతీకని పేర్కొన్నారు.

భారత ప్రధాని నరేంద్ర మోడీ, విపక్ష నేత రాహుల్‌ గాంధీ కలిసి స్పీకర్‌తో సమావేశం కావడంపై స్పందిస్తూ.. ఇది మన సంప్రదాయమని, నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి ప్రధాని పదవి చేపట్టారని, రాహుల్‌ గాంధీ దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర పేరిట పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. దేశ ప్రజల వాణిని రాహుల్‌ సమర్ధంగా వినిపిస్తారనే విశ్వాసం ఉందని చెప్పారు. రాహుల్ గాంధీ చేసిన జోడో యాత్ర   కారణంగానే ఇండియా కూటమి 230కి పైగా సీట్లను సాధించిందని గుర్తు చేశారు. ఎన్డీఏ కూటమి మూడో సారి అధికారంలోకిరావడం శుభపరిణామమన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news