IND VS WI : రికార్డును సమం చేసిన జైస్వాల్-గిల్ జోడి

-

IND vs WI : వెస్టిండీస్ జట్టుపై టీమిండియా నాలుగో టి20 మ్యాచ్ లో విజయం సాధించింది. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్లో టీమిండియా అదరగొట్టింది. వెస్టిండీస్ జట్టుతో జరిగిన నాలుగో టీ 20 మ్యాచ్ లో ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా, ఈ నాలుగో టీ20 మ్యాచ్ లో అదరగొట్టిన కుర్ర ఓపెనర్లు జైస్వాల్, గిల్ అరుదైన రికార్డును సమం చేశారు.

టీ20లో భారత్ తరపున అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన రోహిత్ రాహుల్ (165) రికార్డును సమం చేశారు. నిన్న మ్యాచ్లో గిల్, జైస్వాల్ అర్థసెంచరీలతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఓవరాల్గా భారత్ తరపున ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం. గతేడాది దీపక్ హుడా, శాంసన్ జోడి ఐర్లాండ్ పై 176 పరుగులు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news