కేసీఆర్ చేసినట్లు కోల్‌కతా రేప్ కేసు నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలి !

-

కోల్కత్తా ట్రైనీ డాక్టర్ రేప్ కేసు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఈ కేసులో రంగంలోకి సుప్రీంకోర్టు దిగడం కూడా అయింది. ఏ క్షణమైనా నిందితులకు శిక్ష పడే ఛాన్స్ కూడా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో… ఢిల్లీ లో ఉన్న.. మెడికల్ స్టూడెంట్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేసినట్లుగా… నిందితున్ని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Kolkata Rape Case

కేసీఆర్ చేసింది మమతా బెనర్జీ ఎందుకు చేయలేకపోతున్నారని ఫైర్ అయ్యారు వైద్య విద్యార్థులు. దిశ కేసులో బాధితులకు కేసీఆర్ న్యాయం చేసినట్లు కోల్‌కతా రేప్ కేసు నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలన్నారు. గతంలో దిశ రేప్ కేసుకు సంబంధించి నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యవహరించినట్టు వెస్ట్ బెంగాల్ సీఎం మమత వ్యవహరించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఢిల్లీలో వైద్య విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version