BREAKING : నేడు మోదీకి లోక్‌మాన్య తిలక్ పురస్కారం

-

భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీకి అరుదైన గౌరవం దక్కనుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ లోకమాన్య తిలక్ పురస్కారం అందుకోనున్నారు. మహారాష్ట్ర పర్యటనలో తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరగనున్న కార్యక్రమంలో ఈ అవార్డును ప్రధాని నరేంద్ర మోడీకి అందజేయనున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వ పటిమకు… భారతదేశ పౌరులలో దేశ భక్తిని పెంపొందించినందుకు గాను ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈ అవార్డు ఇస్తున్నట్లు ఆ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఇక ఈ కార్యక్రమానికి ఎన్సీపీ అధినేత శరత్ పవర్ కూడా హాజరుకానున్నారు. కాగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూడా మహారాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు. ఒకే రోజున ప్రధాని నరేంద్ర మోడీ మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మహారాష్ట్ర పర్యటనకు వెళ్లడం ఇదే మొదటిసారి.

Read more RELATED
Recommended to you

Latest news