రామ్ లల్లా భక్తుడు.. వెయ్యి మందికి ఉచితంగా శ్రీరాముడి టాటూలు

-

అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠకు వేళవుతున్న వేళ రామయ్య భక్తులు వివిధ రూపాల్లో తమ భక్తిని చాటుకుంటున్నారు. తాజాగా మహారాష్ట్ర నాగ్‌పుర్‌లోని  టాటూ ఆర్టిస్ట్ హృతిక్ రాజేంద్ర దారోడే శ్రీరాముడిపై భక్తిని వినూత్న రీతిలో చూపిస్తున్నాడు. తన దగ్గరకు వచ్చే భక్తులకు ఉచితంగా రాముడి చిత్రాలను అందంగా చేతులు, ఛాతి, భుజాలపై పచ్చబొట్టు వేస్తున్నాడు.

ఈ విషయం తెలుసుకున్న శ్రీరామ భక్తులు రామ్ లల్లా టాటూ వేయించుకునేందుకు హృతిక్ వద్దకు బారులు తీరుతున్నారు. చాలా సమయం లైన్లలో నిల్చుని మరీ టాటూలు వేయించుకుంటున్నారు. 22 ఏళ్ల  హృతిక్ రాజేంద్ర దారోడే ప్రతి ఏడాది శ్రీరామనవమికి ఏదో కార్యక్రమాన్ని చేపడుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకుని వినూత్నంగా టాటూలు వేయాలని డిసైడ్ అయ్యాడు. సుమారు 101 మందికి ఉచితంగా శ్రీరాముడి పచ్చబొట్లను వేయాలని నిర్ణయించినట్లు హృతిక్ తెలిపాడు. ఆ తర్వాత మంచి స్పందన రావడం వల్ల ఈ సంఖ్యను 1,001కు పెంచాడు. ఇప్పటివరకు సుమారు 350 మందికి టాటూలను వేశాడు హృతిక్​.

Read more RELATED
Recommended to you

Latest news