మలేరియా వ్యాధిపై పోరులో ముందడుగు.. వాక్సిన్​కు WHO ఆమోదం

-

మలేరియాపై పోరులో మరో కీలక ముందడుగు పడింది. ఈ ప్రాణాంతక వ్యాధి నివారణ ప్రయత్నాల్లో దోహదపడే సరికొత్త టీకా వినియోగానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ టీకా వినియోగానికి తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోద ముద్ర వేసింది.

సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సాయంతో ఆక్స్ ఫర్డ్ వర్సిటీ మలేరియా వ్యాక్సిన్​ను అభివృద్ధి చేసింది. మలేరియా నుంచి ఇది 75 శాతానికిపైగా రక్షణ కల్పిస్తుందని ఈ టీకాను అభివృద్ధి చేసిన పరిశోధకులు తెలిపారు. ఇది మూడు డోసుల టీకా అని, బూస్టర్ కూడా వేసుకోవచ్చని వెల్లడించారు.

వచ్చే ఏడాది నుంచి కొన్ని దేశాల్లో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. మలేరియా ముప్పు ఎక్కువగా ఉన్న చిన్నారుల్లో ఈ టీకా వాడకానికి రెండు నిపుణుల బృందాలు చేసిన సిఫార్సు మేరకు ఆమోద ముద్ర వేశామని ప్రపంప ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ తెలిపారు. ఘనా, బుర్కినాఫాసోలో అధికారవర్గాలు ఈ వ్యాక్సిన్ ను ఇప్పటికే ఆమోదించాయి.

Read more RELATED
Recommended to you

Latest news