నేడు నాగాలాండ్, మేఘాలయ సీఎం ప్రమాణస్వీకారం..హాజరు కానున్న మోడీ

-

నేడు నాగాలాండ్, మేఘాలయ ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారం జరుగనుంది. అయితే, ఈ ప్రమాణ స్వీకారోత్సవాలకు హాజరవుతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.”నేషనల్ పీపుల్స్ పార్టీ” ( ఎన్.పి.పి) నేత కొనరాడ్ సంగ్మా నేతృత్వంలో మేఘాలయలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కాగా, “నేషనలిస్టు డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ” ( ఎన్.డి.పి.పి) నేత రియో నేతృత్వంలో నాగాలాండ్ లో ప్రభుత్వం ఏర్పాటు అయింది.

రియో నేతృత్వంలో అన్ని పార్టీల భాగస్వామ్యంతో కూడిన ప్రభుత్వం ఏర్పడింది.
దేశ సరిహద్దు రాష్ట్రంలోశాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు కేంద్రం ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఎన్.ఎస్.సి.ఎన్ (ఐ.ఎమ్) మాజీ తీవ్రవాదులతో కేంద్ర సంప్రదింపులు కొనసాగిస్తోంది కేంద్ర ప్రభుత్వం. త్రిపురలో బిజెపి నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అయింది. ఇక గురువారం త్రిపుర ముఖ్యమంత్రి గా బిజేపి నేత మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news