‘భారత్ జాబిల్లిని చేరుకుంటే.. పాక్ ప్రపంచాన్ని అడుక్కుంటోంది’ : ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌

-

పాకిస్థాన్ గత కొన్ని నెలలుగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి కొట్టుమిట్టాడుతోంది. ప్రపంచ దేశాల సాయం కోరుతూ నెట్టుకొస్తోంది. అయితే తాజాగా పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభవంపై ఆ దేశ మాజీ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు భారత్‌ చంద్రుడిని చేరి, జీ20 సమావేశాలను జరిపి అభివృద్ధిలో దూసుకెళ్తుంటే.. పాకిస్థాన్‌ మాత్రం ప్రపంచం ముందు అడుక్కుంటోందని వ్యాఖ్యానించారు. పాక్​ ఇలా ఆర్థిక గందరగోళాన్ని ఎదుర్కోడానికి దేశంలోని మాజీ జనరళ్లు, కొందరు న్యాయమూర్తులే కారణమని ఆరోపించారు.

పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ పార్టీ సమావేశంలో లండన్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్​లో నవాజ్ మాట్లాడుతూ.. పాకిస్థాన్‌ ప్రధాని నేడు దేశ విదేశాలు తిరుగుతూ నిధుల కోసం వేడుకొంటున్నారని .. భారత్‌ సాధించిన ఘనతను పాకిస్థాన్​ ఎందుకు సాధించలేకపోయింది? దీనికి బాధ్యులు ఎవరు? అని ప్రశ్నించారు. ‘నా ఉద్వాసన వెనుక నలుగురు న్యాయమూర్తులు, అప్పటి ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఖమర్‌ జావేద్‌ బజ్వాతోపాటు ఐఎస్‌ఐ చీఫ్‌ జనరల్‌ ఫయాజ్‌ హమీద్‌ ఉన్నారు. పాక్​ ఈ దుస్థితికి చేరుకోడానికి కారణమైన ఈ అధికారులు జవాబుదారీ వహించాల్సి ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో మా పార్టీ తప్పక విజయం సాధిస్తుంది’ అని నవాజ్‌ ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news