BIG BREAKING : ఇండియా లో విస్త‌రిస్తున్న ఓమిక్రాన్.. మ‌రో 9 కేసులు

-

ఇండియా లో ఓమిక్రాన్ వేరియంట్ వేగం గా విస్త‌రిస్తుంది. తాజా గా తొమ్మిది కేసులు న‌మోదు అయ్యాయి. రాజ‌స్థాన్ లో ని జైపూర్ లో ఈ తొమ్మిది కేసులు న‌మోదు అయ్యాయి. ఈ తొమ్మిది మంది కూడా ఒకే కుటుంబాని కి చెందిన వారి గా తెలుస్తుంది. వీరు వారం క్రితం వీరు సౌత్ ఆఫ్రికా నుంచి వ‌చ్చార‌ని తెలుస్తుంది. అయితే వీరి తో నే ఓమిక్రాన్ వేరియంట్ వ‌చ్చింద‌ని అధికారులు అనుమానిస్తున్నారు. కాగ ఈ రోజు సాయంత్రమే మ‌హారాష్ట్ర లో ఏడు కేసులు న‌మోదు అయ్యాయి.

వీటి తో క‌లిసి దీంతో దేశ వ్యాప్తం గా ఓమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 21 కి చేరుకుంది. అయితే మ‌న దేశం లో ఓమిక్రాన్ వేరియంట్ మొద‌టి కేసు శ‌ని వారమే వ‌చ్చింది. మ‌హారాష్ట్ర లో మొద‌టి ఓమిక్రాన్ వేరియంట్ కేసు న‌మోదు అయింది. దీంతో మొత్తం మ‌హారాష్ట్ర లో ఓమిక్రాన్ కేసుల సంఖ్య 8 కి చేరింది. అలాగే నేటి కేసుల తో రాజ‌స్థాన్ లో 9 కేసులు న‌మోదు అయ్యాయి. అలాగే గుజ‌రాత్ లో ఒక‌టి న‌మోదు అయింది. ఢిల్లీ లో కూడా ఓమిక్రాన్ వేరియంట్ కేసులు న‌మోదు అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news