కేరళలో బాంబు పేలుడు: ఒకరు మృతి, 20 మందికి గాయాలు

-

కేరళలోని కొచ్చిలో ఈ ఉదయం జరిగిన వరుస పేలుళ్ళు ఘటనలో ఒకరు మరణించారు. మరికొంతమందికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

One dead, over 20 injured in blast at convention centre in Kerala

జమ్ర ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో క్రైస్తవుల ప్రార్థనల సందర్భంగా ఈ ఉదయం 9:40 గంటలకు ఈ ఘటన జరిగింది. కొద్ది నిమిషాల వ్యవధిలోనే వరుస పేలుళ్లు జరిగాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ATS టీం ఘటనాస్థలానికి చేరుకుంది.  జమ్ర ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో వేదిక కుడివైపున ఈ పేలుడు సంభవించింది. ఇక ఈ పేలుడు సంభవించిన సమయంలో 2000 మందికి పైగా అక్కడ ఉన్నారు. ఇక గాయపడిన వారిలో పిల్లలు మరియు వృద్ధులు ఉన్నారు. ఈ పేలుళ్ల వెనుక ఉగ్ర వాదుల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version