దక్షిణ భారత ప్రజలు నన్ను ఎంతో ప్రేమిస్తున్నారు : ప్రధాని మోడీ

-

రామాయణంతో ముడిపడి ఉన్న క్షేత్రాలను ఇటీవల దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్టు ప్రధాని మోడీ తెలిపారు తక్షణ భారత ప్రజలు నన్ను ఎంతో ప్రేమిస్తున్నారు. కంబ రామాయణం విని పులకించిపోయాను అని చెప్పారు. దేశంలో తటస్తులు కూడా బిజెపికి మద్దతు పలుకుతున్నారని విమర్శించే వాళ్ళు కూడా చాటుగా ప్రశంసిస్తున్నారని వెల్లడించారు మోడీ.

అబద్ధపు హామీలు ఇవ్వడంలో విపక్షాలు పోటీపడతున్నాయని ప్రధాని విమర్శించారు. మేమిచ్చే హామీలు ప్రతిపక్ష నేతలు మాటల్లో ఎప్పుడూ విని ఉండరు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నాం. రామ మందిరం పూర్తి చేసి ఐదు దశాబ్దాల కల నెరవేర్చాం. ఆర్టికల్ 370, త్రిపుల్ తలాకును రద్దు చేశాం. మహిళా రిజర్వేషన్లు కల్పించాం కొత్త పార్లమెంటు నిర్మించి ప్రజల ఆకాంక్షను నెరవేర్చామని తెలిపారు. నాకు వ్యక్తిగత ప్రతిష్ట, అధికారం, కుటుంబం కూడా ముఖ్యం కాదు. దేశ ప్రజలే నా కుటుంబం అని మోడీ పేర్కొన్నారు.  ఉగ్రవాదం, అవినీతి నుంచి దేశాన్ని విముక్తి చేశామని వివరించారు ప్రధాని మోడీ.

Read more RELATED
Recommended to you

Latest news