PM Kishan: ఇలా చేస్తేనే అకౌంట్లలో డబ్బులు పడతాయి!

-

భారతదేశ రైతులకు అదిరిపోయే శుభవార్త అందించింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. కొత్తగా ప్రభుత్వంలోకి రాగానే… రైతులకు న్యాయం చేసే దిశగా ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే నరేంద్ర మోడీ ఇవాళ 17వ విడత పిఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్నారు. వారణాసిలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోడీ…. 9.26 కోట్ల మంది రైతులు అకౌంట్లో ₹20,000 కోట్లు జమ చేయనున్నారు.

PM Kisan 17th Installment Date 2024

అయితే… పీఎం కిసాన్ డబ్బులను ప్రధాని మోదీ ఇవాళ జమ చేయనున్నారు. ఈ-కేవైసీ చేయించుకున్న రైతులకే ఈ పథకం రూ. 2వేలు జమ అవుతాయి. pmkisan.gov.inసైట్ లో సులభంగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ఆ సైట్ ఓపెన్ చేసి కుడివైపున ఉండే ఈ-కేవైసీపై క్లిక్ చేయాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. దానిని సబ్మిట్ చేస్తే చాలు ఈ-కేవైసీ పూర్తి అయినట్లే.

 

Read more RELATED
Recommended to you

Latest news