రైతులకు కేంద్రం శుభవార్త.. పీఎం కిషాన్ నిధులపై కీలక ప్రకటన !

-

దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 14వ విడత పిఎం కిసాన్ సొమ్ములను కేంద్ర ప్రభుత్వం ఈనెల 27వ తేదీన అంటే రేపు రైతులకు అందించనున్నట్టు వెల్లడించింది. ఏడాదికి మూడు విడతలుగా రూ. 2 వేల చొప్పున మొత్తం ఏడాదికి రూ. 6,000 పిఎం కిసాన్ యోజన కింద రైతులకు వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 27వ తేదీన రాజస్థాన్ లోని సికార్ లో జరిగే కార్యక్రమంలో ఈ నిధులను విడుదల చేస్తారని అధికారులు తెలిపారు. కాగా, కేంద్రం ఎన్నో స్కీములని తీసుకు వచ్చింది. ఈ స్కీమ్స్ వలన ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటోంది. రైతుల కోసం కూడా మోడీ సర్కార్ ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే సర్కార్ రైతుల కోసం తీసుకు వచ్చిన స్కీమ్స్ లో పీఎం కిసాన్ యోజన పథకం ఒకటి.

Read more RELATED
Recommended to you

Latest news