ఈశాన్య రాష్ట్రాలను విభజించే కుట్రను అడ్డుకుంటున్నాం : మోదీ

-

ఈశాన్య రాష్ట్రాలను విభజించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. అలాంటి కుట్రలకు తాము చెక్ పెడుతున్నామని తెలిపారు. షిల్లాంగ్‌లోని స్టేట్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన ఈశాన్య కౌన్సిల్‌ గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొన్న మోదీ.. ఈ ప్రాంత అభివృద్ధికి ఇప్పటివరకు వచ్చిన అడ్డంకులకు రెడ్‌ కార్డ్‌ (ఫిఫా ఫైనల్‌ను ప్రస్తావిస్తూ) చూపించామన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు రూ.6వేల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ ప్రారంభాలు, శంకుస్థాపనలు చేశారు. అవినీతి, పక్షపాతం, హింస, ఓటు బ్యాంకు రాజకీయాలను నిర్మూలించేందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని మోదీ తెలిపారు.

సైనిక ప్రభావం అత్యధికంగా ఉండే ఈశాన్య రాష్ట్రాల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం శాంతిని నెలకొల్పిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. ఒకప్పుడు హింస, వేర్పాటువాదంతో అట్టుడుకుపోయే ఈ ప్రాంతం ప్రస్తుతం అభివృద్ధివైపు అడుగులు వేస్తోందన్నారు. గడిచిన ఎనిమిదేళ్లలో తిరుగుబాటు సంఘటనలు 70 శాతం.. భద్రతా సిబ్బందిపైనా దాడులు 60 శాతం తగ్గాయని తెలిపారు. పౌరులు గాయాలపాలయ్యే సంఘటనలు కూడా 89 శాతం తగ్గుముఖం పట్టాయని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news