బెంగాల్ రైలు ప్రమాదంపై పోలీసుల ప్రకటన..15 మంది మృతి!

-

Police statement on Bengal train accident: బెంగాల్ రైలు ప్రమాదంపై పోలీసులు కీలక ప్రకటన చేశారు. పశ్చిమ బెంగాల్ న్యూ జల్పాయిగుడిలో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 15 మంది చనిపోయినట్లు డార్జిలింగ్ ASP అభిషేక్ రాయ్ వెల్లడించారు. 20-25 మంది గాయపడినట్లు, కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.

Police statement on Bengal train accident

ఘటనా స్థలంలో పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కాంచన్జంఘా ఎక్స్ప్రెస్ రైలును గూడ్స్ ఢీ కొట్టినట్లు ఆయన చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, పశ్చిమ బెంగాల్ – డార్జిలింగ్ జిల్లాలోని న్యూజల్పాయిగురిలో రెండు రైళ్లు ఢీకొన్నాయి. గూడ్స్ రైలును ఢీకొట్టింది కాంచనజంగ ఎక్స్ ప్రెస్ రైలు.

Read more RELATED
Recommended to you

Latest news