రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న ప్రధాని మోదీ

-

ప్రధాని నరేంద్ర మోడీ కాసేపటి క్రితం హెలిక్యాప్టర్ లో భువనేశ్వర్ కి చేరుకున్నారు. బాలాసోర్ లో రైలు ప్రమాద ఘటన స్థలంలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు మోదీ. ప్రాథమిక రిపోర్టును ప్రధాని మోదీకి వివరిస్తున్నారు కేంద్ర మంత్రులు. అనంతరం ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి ప్రమాదంపై చర్చించనున్నారు ప్రధాని మోదీ. ప్రమాదం ఎలా జరిగిందన్న విషయాన్ని ప్రధాని మోదీకి వివరిస్తున్నారు కేంద్ర మంత్రులు, అధికారులు.

 

అధికారులతో సమావేశం అనంతరం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించనున్నారు. ఇక సిగ్నల్ లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని రైల్వే శాఖ నివేదికలో వెల్లడించిన విషయం తెలిసిందే. లూప్ లైన్ లో ఆగి ఉన్న గూడ్స్ రైలును కోరమండల్ ఎక్స్ప్రెస్ ఢీ కొట్టిందని వివరించింది రైల్వే శాఖ. అదే సమయంలో బెంగళూరు – హౌరా ఎక్స్ప్రెస్ రైలు వచ్చిందని.. దాంతో ప్రమాద తీవ్రతం మరింత పెరిగిందని వివరించింది.

Read more RELATED
Recommended to you

Latest news