సెల్ఫ్ ఐసోలేష‌న్ లో ప్రియాంక గాంధీ

-

కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ వాద్రా సెల్ఫ్ ఐసోలేష‌న్ లో ఉన్నారు. ఈ విష‌యాన్ని ప్రియాంక గాంధీ వాద్రా త‌న ట్వీట్టర్ ద్వారా అధికారికంగా తెలిపారు. అయితే ప్రియాంక గాంధీ వాద్రా కుటుంబ స‌భ్యులతో పాటు వ్య‌క్తిగ‌త సిబ్బందిలో ఒక‌రికి క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింద‌ని తెలిపారు. అయితే త‌న‌కు క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లో నెగిటివ్ అని తెలింద‌ని తెలిపారు. అయితే త‌న‌ను కొన్ని రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేష‌న్ ఉండాల‌ని డాక్ట‌ర్లు స‌ల‌హా ఇచ్చార‌ని తెలిపారు.

సెల్ఫ్ ఐసోలేష‌న్ త‌ర్వాత మ‌రో సారి క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష చేసుకుంటాన‌ని తెలిపారు. అయితే ఇటీవ‌ల క‌రోనా వైర‌స్ సామాన్యుల‌తో పాటు సెల‌బ్రెటీల‌ను కూడా వ‌ద‌ల‌డం లేదు. ప్ర‌స్తుతం రోజుకు క‌రోనా కేసులు విప‌రీతంగా వ‌స్తున్నాయి. ఈ ఒక్క రోజే 33,750 క‌రోనా వైర‌స్ కేసులు వెలుగు చూశాయి. అంతే కాకుండా ఓమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా రోజు రోజుకు పెరుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news