BREAKING : గూడ్స్ రైలును ఢీకొన్న సబర్మతి ఎక్స్ప్రెస్

-

మరో రైలు ప్రమాదానికి గురైంది. రాజస్థాన్ అజ్మేర్లోని మదార్ స్టేషన్ సమీపంలో ఉన్న గూడ్స్ రైలును సబర్మతి ఎక్స్ప్రెస్ వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టింది. ఫలితంగా సబర్మతి ఎక్స్ప్రెస్ ఇంజిన్ సహా 4 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాకపోతే కొంత మంది గాయపడ్డారని.. వారిని దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించినట్లు నార్త్ వెస్ట్రన్ రైల్వే జోన్ చీఫ్ శశి కిరణ్ వెల్లడించారు.

ఈ ఘటన కారణంగా ఆరు రైళ్లు రద్దు చేశామని, మరో రెండు రైళ్లను వేరే మార్గాల ద్వారా మళ్లించామని కిరణ్ తెలిపారు. సబర్మతి రైలులో ప్రయాణిస్తున్న వారిని అజ్మేర్ రైల్వే స్టేషన్కు తరలించినట్లు వెల్లడించారు. త్వరలోనే ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు పంపిస్తామని తెలిపారు. ఘటనాస్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్లు అజ్మేర్ రైల్వే డిఆర్ఎమ్ రాజీవ్ ధన్కర్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news