మణిపుర్​ అమానవీయ ఘటన.. అదే రోజు మరో దారుణం

-

జాతుల మధ్య వైరంతో రెండు నెలలుగా మణిపుర్ భగ్గుమంటోంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలో ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు అక్కడి మహిళలపై అమానుష ఘటనలు జరుగుతున్నాయి. మణిపుర్‌లో ఇద్దరు మహిళలపై అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది.

ఈ ఘటన తర్వాత మరో రెండు మూడు దారుణ ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. అందులో ఒకటి.. కుకీ తెగకు చెందిన వ్యక్తి తల నరికి కంచెకు వేలాడదీయడం. మరో ఘటన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ప్రాంతానికి సరిగ్గా 40 కిలోమీటర్ల దూరంలో అదే రోజున మరో ఇద్దరు యువతులపై సామూహిక అత్యాచారం జరిగినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

కాంగ్‌పోక్పీ ప్రాంతంలో ఇద్దరు యువతులు కార్లు సర్వీస్‌ చేసే కేంద్రంలో పని చేస్తుండగా.. కొందరు వ్యక్తులు వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అక్కడి నుంచి వారిని బయటకు లాగిపడేశారని, ఈ ఘటనలో వారు తీవ్రంగా గాయపడ్డారని వార్తా కథనాలు పేర్కొన్నాయి. తర్వాత వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వారి స్నేహితురాలు ఒకరు మీడియాకు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news