ఈ పవర్ ఎక్కడి నుంచి వస్తుందని అడిగా..జైస్వాల్ పై రోహిత్ ప్రశంసలు

-

ఐపీఎల్ 2023 సీజన్ చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. అయితే, తాజాగా ఐపీఎల్ 2023 సీజన్ లో ముంబై ఇండియన్స్ మరో విజయాన్ని అందుకుంది. రాజస్థాన్ రాయల్స్ తో ఆదివారం జరిగిన 1000వ ఐపిఎల్ మ్యాచ్లో 6 వికెట్లు తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో యశస్వి జైస్వాల్ శతకం వృధా అయ్యింది.

ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 212 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీతో చెలరేగాడు. అయితే, నిన్న ముంబైపై సెంచరీ చేసిన యువ క్రికెటర్ యశస్వి జైశ్వాల్ పై రోహిత్ శర్మ విమర్శలు కురిపించారు. ‘నేను యశస్వి ఆట తీరును గతేడాది చూశా. ఈ ఏడాది ఆటను మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఈ పవర్ ఎక్కడినుంచి వస్తుందని నేను అతన్ని అడిగా. జిమ్ లో కష్టపడుతున్నట్లు చెప్పాడు. యశస్వి టైమింగ్ చాలా బాగుంది. ఇది అతనికి, భారత క్రికెట్ కు, అలాగే రాజస్థాన్ రాయల్స్ కు శుభ పరిణామం’ అని కొనియాడాడు.

Read more RELATED
Recommended to you

Latest news