ముంబై బస్సు లో సచిన్ టెండూల్కర్ ఫోటోలు వైరల్..

-

సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉండే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఎప్పటికప్పుడు తన గురించి, క్రికెట్ గురించి పోస్టులు పెడుతుంటారు. ఇప్పుడు కూడా సచిన్ టెండూల్కర్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట చెక్కర్లు కొడుతుంది. సోమవారం తన చిన్న నాటి సంగతులను గుర్తు చేసుకుంటూ ఓ పోస్ట్ చేశాడు. ఒక్కసారిగా బస్సు ఎక్కి బాల్యంలోకి వెళ్ళిపోయాడు.

 

ఇదంతా సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. శివాజీ పార్కు కు వెళ్లే బస్సు ఫుట్ బోర్డు పై నిలబడి సచిన్ దిగిన ఈ ఫోటో ఇప్పుడు అంతర్జాతీయంగా చెక్కర్లు కొడుతుంది. “తిరిగి బాల్యంలోకి” అనే శీర్షికతో సచిన్ ఈ ఫోటోని సోమవారంనాడు పోస్ట్ చేశాడు. చిన్నతనంలోనే క్రికెట్ మొదలెట్టిన అతను ప్రాక్టీస్ మ్యాచ్ ల కోసం ముంబై బస్సులో ప్రయాణించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ జ్ఞాపకాలను మరోసారి సచిన్ నెమరేసుకున్నాడు. పదహారేళ్ళకే అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టిన సచిన్ ఎన్నో రికార్డులు సొంతం చేసుకొని తిరుగు లేని రారాజుగా అవతరించాడు.

Read more RELATED
Recommended to you

Latest news