నాగ్‌పూర్‌లో సలామ్‌ ఎయిర్‌ విమానం ఎమర్జెన్సీ ల్యాడింగ్‌

-

బంగ్లాదేశ్‌కు చెందిన సలామ్‌ ఎయిర్‌ ఓవీ406 విమానం మహారాష్ట్రలోని నాగ్‌పూర్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ అయింది. 200 మంది ప్రయాణికులతో బంగ్లాలోని చిట్టగాండ్‌ నుంచి మస్కట్ వెళ్తోన్న ఈ విమానంలోని కార్గో ఏరియాలో పొగలు రావడాన్ని పైలట్‌ గుర్తించారు. వెంటనే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కు సమాచారం అందించారు.

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ విమానాశ్రయంలో విమానాన్ని దించడానికి అధికారులు అనుమతించారు. ఈ క్రమంలో విమానాశ్రయంలో అత్యతవసరి పరిస్థితి ప్రకటించారు. అంబులెన్సులు, ఫైర్‌ ఇంజిన్లను సిద్ధం చేశారు. అయితే విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

విమానంలో మొత్తం 200 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. కార్గో ఏరియాలోనే పొగలు వచ్చాయని వెల్లడించారు. ప్రయాణికులను పైలట్‌ అప్రమత్తం చేశారని చెప్పారు. బంగ్లాదేశ్‌కు చెందిన ఓ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అవడం ఇది రెండో సారి. 2021లో బైమన్‌ బంగ్లాకు చెందిన విమానం పైలట్‌కు గుండెపోటు రావడంతో అత్యవసరంగా విమానాశ్రయంలో దిగింది.

Read more RELATED
Recommended to you

Latest news