చట్టసభల్లో అవినీతికి పాల్పడే వారికి విచారణ నుంచి మినహాయింపు!.. 1998 తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

-

చట్టసభల్లో అవినీతి చర్యలకు పాల్పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు విచారణ నుంచి మినహాయింపునిస్తూ 1998లో తీర్పు వెలువడిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై తాజాగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ తీర్పును పునఃపరిశీలించేందుకు అంగీకరించిన సర్వోన్నత న్యాయస్థానం.. ఇందుకోసం ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం బుధవారం ఈ విషయాన్ని వెల్లడించింది.

2012 రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీ శాసనసభ్యురాలు సీతా సోరెన్‌ ఒక పార్టీ అభ్యర్థికి ఓటు వేయడానికి లంచం పుచ్చుకుని మరొకరికి ఓటు వేశారనే ఆరోపణలపైసీబీఐ కేసు నమోదు చేసింది. ఈ క్రిమినల్‌ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆమె తొలుత ఝార్ఖండ్‌ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ తిరస్కరణకు గురవ్వడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు చట్టసభల్లో అవినీతికి పాల్పడినప్పుడు వారిపై చర్యలు తీసుకోవచ్చా? వారికి రక్షణ ఉంటుందా? అనే అంశాన్ని 2019లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పరిశీలించింది.

తాజాగా ఆ కేసును పరిశీలించిన జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. సభలో చేసే ప్రసంగాలు, అక్కడ వేసే ఓట్లపై ఎంపీలకు రాజ్యాంగపరమైన రక్షణ ఉంటుందని పి.వి.నరసింహారావు వర్సెస్‌ సీబీఐ కేసులో 1998లో వెలువడిన తీర్పును పునఃపరిశీలిస్తామని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news