BREAKING : గుడికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్

-

రాజస్థాన్‌ సవాయ్ మాధోపుర్​లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాధోపుర్ రోడ్డులో కారును ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడం వల్ల ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందినట్లు చెప్పారు.  క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. మృతులందరూ కారులో సవాయి మాధోపుర్​లోని గణేశ్ ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. అతివేగం లేదా మద్యం మత్తులో డ్రైవర్ వాహనం నడపడం వల్ల ఈ ఘటన చోటుచేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news