ఆర్టికల్ 370 పై కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తోంది : ప్రధాని మోడీ

-

ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూ-కశ్మీర్  స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. తద్వారా అభివృద్ధిలో ఈ ప్రాంతం సరికొత్త శిఖరాలను తాకుతోందని చెప్పారు. ‘ఆర్టికల్ 370’ రద్దు అనంతరం తొలిసారి కశ్మీర్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ.. బక్షీ స్టేడియంలో నిర్వహించిన సభలో ప్రసంగించారు. ‘ఆర్టికల్ 370’పై ఒక్క జమ్మూ- కశ్మీర్నే కాదు, యావత్ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు.

అంతకుముందు స్థానికంగా రూ. 6400 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ ప్రాంతాన్ని దేశానికి కిరీటంగా అభివర్ణిస్తూ.. రైతుల సాధికారత, పర్యటక అవకాశాలు వికసిత జమ్మూ-కశ్మీర్ నిర్మాణానికి బాటలు వేస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా స్థానికులకు ముందస్తుగా మహాశివరాత్రి, రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలిపారు. మోదీ పర్యటనను పురస్కరించుకుని కశ్మీర్ లోయలో ఇప్పటికే హైఅలర్ట్ ప్రకటించారు. స్థానికంగా భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు.. వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news