టీచర్ దాష్టీకం.. రెండో తరగతి విద్యార్థిపై వేడి నీళ్లు పోసి..

-

ఓ విద్యార్థి యూనిఫాంలో మలవిసర్జన చేశాడని ఆ చిన్నారి పట్ల అత్యంత అమానవీయంగా ప్రవర్తించాడు ఓ కర్కశ ఉపాధ్యాయుడు. ఆ చిన్నారి శరీరంపై సలసల కాగుతున్న వేడి నీళ్లు పోశాడు. ఒక్కసారిగా వేడి నీళ్లు మీద పడటంతో ఆ పిల్లాడు తల్లడిల్లిపోయాడు. అతడి శరీరం 40 శాతం వరకు కాలిపోయింది. ఈ అమానవీయ ఘటన కర్ణాటక రాయచూర్‌లో చోటుచేసుకుంది.

కర్ణాటక రాయచూర్‌లోని సంతకళ్లూరులో శ్రీగణమాతేశ్వర ప్రైమరీ పాఠశాలలో బాలుడు రెండో తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం తీవ్రంగా గాయపడిన బాలుడు.. లింగసుగూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సెప్టెంబరు 2న జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలుడిపై దాడికి పాల్పడిన రోజు నుంచి ఉపాధ్యాయుడు హుళిగెప్ప పాఠశాలకు రావట్లేదని సమాచారం. ఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నా.. ఆ ఉపాధ్యాయుడిపై కేసు నమోదు కాలేదు. అతడిపై ఫిర్యాదు చేయవద్దని టీచర్ తరఫు పెద్ద మనుషులు బాలుడి తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news