పీఎంఓ నకిలీ అధికారి పై కేసు.. రంగంలోకి సీబీఐ

-

ప్రధాన మంత్రి కార్యాలయంలో తాను ఒక ఉన్నతాధికారిని అని పేర్కొంటూ.. సెటిల్ మెంట్ వ్యవహారానికి దిగిన మోసగాడు మయాంక్ తివారి కేసులో సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే కేసు నమోదు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ తాజాగా తివారికి సంబంధించిన పలు ప్రాంతాల్లో తనిఖీలను చేపట్టింది. ఈ సోదాల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు అధికారులు.

ఈ కేసులో తివారీని ఇంకా అరెస్ట్ చేయలేదని చెప్పారు. డాక్టర్ అగర్వాల్ అనే కంటి ఆసుపత్రిలో ఇందౌర్ కు చెందిన ఓ ఆసుపత్రి గతంలో ఒప్పందం చేసుకుంది. ఒప్పందం నిబంధనలను ఇందౌర్ ఆసుపత్రి ఉల్లంఘించడంతో డాక్టర్ అగర్వాల్ ఆ అగ్రిమెంట్ ను రద్దు చేసుకున్నారు. ఇది కాస్తా ఇరు వర్గాల మధ్య విభేదాలకు దారి తీసింది. ఈ విషయం హై కోర్టు వరకు వెళ్లడంతో డాక్టర్ అగర్వాల్ హాస్పిటల్ కి రూ.16.43 కోట్లు చెల్లించాలని ఇందౌర్ హాస్పిటల్ ను ఆదేశించింది కోర్టు.

ఈ వివాదం సమయంలో మయాంక్ తివారీ నుంచి ఆసుపత్రి ప్రమోటర్ డాక్టర్ అగర్వాల్ కి వరుస ఎస్.ఎం.ఎస్ లు వచ్చాయి. ఆ సొమ్మును మరిచిపోయి ఆసుపత్రిలో పరిష్కారం కుదుర్చుకోవాలంటూ అందులో తివారీ బెదిరించాడు. తాను పీఎంవోలో ఉన్నతాధికారినంటూ పేర్కొన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news