ఆ వార్తలు అవాస్తవం.. తాను బాగానే ఉన్నా : రతన్ టాటా

-

ప్రముఖ వ్యాపారవేత్త, టాటా ఇండస్ట్రీస్ అధినేత రతన్ టాటా ఆరోగ్యం విషమంగా ఉందని పలు జాతీయ మీడియా సంస్థలు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలపై రతన్ టాటా స్పందించారు. తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. తన ఆరోగ్యం బాగానే ఉన్నదని.. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.  ఐసీయూలో చేరినట్టు వస్తున్న  వార్తలను ఖండించారు.

బీపీ లెవల్స్ తగ్గిపోవడంతో తాను సోమవారం ఉదయం ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి వెళ్లినట్టు తెలిపారు. ముఖ్యంగా ఆయన ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. ” నా గురించి ఆలోచిస్తున్నందుకు కృతజ్ఞతలు. నా ఆరోగ్యం విషయంగా ఉందని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. వయస్సు రిత్యా ఎదుర్కుంటున్న ఆరోగ్య సమస్యల నేపథ్యంలో మెడికల్ చెకప్ చేయించుకుంటున్నాను. ఇందులో ఆందోళన చెందాల్సిన అవసరం అస్సలే లేదు. నేను క్షేమంగానే ఉన్నాను. వాస్తవాలు తెలుసుకొని ప్రజలు, మీడియా ప్రచారం చేయాలి” అని కోరుతున్నట్టు తెలిపారు రతన్ టాటా. 

 

Read more RELATED
Recommended to you

Latest news