గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్‌

-

ఉత్తర్ ప్రదేశ్లో గ్యాంగ్‌స్టర్‌ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముఖ్తార్‌ అన్సారీ (63) గుండెపోటుతో మృతి చెందారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అన్సారీ 2005 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆయన మృతికి సంబంధించి అధికారులు మెడికల్‌ బులెటిన్‌ విడుదల చేశారు. యూపీలోని బాందా జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్సారీ గురువారం సాయంత్రం 8.25 గంటల సమయంలో ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారని అధికారులు తెలిపారు. వాంతులు చేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆయన్ను దుర్గావతి మెడికల్‌ కళాశాల ఆసుపత్రికి తరలించగా చికిత్స చేస్తున్న సమయంలో ఆయన గుండెపోటుతో మరణించారని బులెటిన్లో పేర్కొన్నారు.

అన్సారీ మృతితో ఆసుపత్రి పరిసరాల్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో 144 సెక్షన్‌ విధించారు. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా బాందా, మౌ, ఘాజీపుర్‌, వారణాసి జిల్లాల్లో అదనపు పోలీసు బలగాలతో పాటు, సెంట్రల్‌ రిజర్వ్‌ బలగాలను మోహరించినట్లు యూపీ డీజీపీ ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news