బీఆర్ఎస్ నేతలు పార్టీని వీడుతున్న వేళ.. కేటీఆర్ కీలక ప్రకటన..!

-

పార్లమెంట్ ఎన్నికల వేళ కీలక నేతలు పార్టీని వీడుతుండటంతో బీఆర్ఎస్ క్షేత్రస్థాయి నేతలు, కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. ఒకేసారి ఇద్దరు ముగ్గురు ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తుండటంతో తమ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని జిల్లాలోని సెకండ్ క్యాడర్ లీడర్స్ ఆవేదన చెందుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ప్రకటన చేశారు.

“శూన్యం నుంచి సునామీ సృష్టించి అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి మన కేసీఆర్. ఒక్కడుగా బయలుదేరి లక్షలాది మంది సైన్యాన్ని తయారు చేసి, ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నింటినీ ఛేదించిన ధీరత్వం కేసీఆర్. అలాంటి ధీరుడుని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బతీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెబుతారు. ప్రజా ఆశీర్వాదం మద్దతుతో 14 ఏళ్లు పోరాడి, ఉద్యమ పార్టీగా రాష్ట్రాన్ని సాధించి తెచ్చుకున్న తెలంగాణ దశను, దిశను మార్చి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటారు. నికార్సైన కొత్తతరం నాయకత్వం తయారు చేస్తాం, పోరాట పంథాలో కదం తొక్కుదాం.. జై తెలంగాణ.. జై కేసీఆర్” అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు కేటీఆర్. 

Read more RELATED
Recommended to you

Latest news