అడవిలో అమెరికా మహిళ కేసులో ట్విస్ట్

-

ఇటీవల మహారాష్ట్ర సింధు దుర్గ్‌ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఆకలితో అలమటిస్తూ పూర్తిగా నీరసించిపోయిన స్థితిలో ఓ మహిళ కనిపించిన విషయం తెలిసిందే. ఆమెను గుర్తించిన పశువుల కాపరి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది అయితే ఈ కేసులో తాజాగా ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. చెట్టుకు ఇనుప గొలుసులతో బంధించడంలో ఇతరుల ప్రమేయం లేదని, తనను తానే అలా బంధించుకున్నానని ఆ మహిళ చెప్పడంతో పోలీసులు షాక్ తిన్నారు. తాను మానసిక సమస్యలతో బాధపడుతున్నానని, తనకు భర్త కూడా లేడని చెప్పింది.

ప్రస్తుతం రత్నగిరిలోని ఓ మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఆమె.. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పిన విషయాలతో ఖాకీలు కంగుతిన్నారు. తన వెంట మూడు తాళాలు, ఇనుప గొలుసులు తెచ్చుకుని అందులో ఓ తాళంతో తనకు తానే చెట్టుకు కట్టేసుకుందని వాంగ్మూలంలో ఆ మహిళ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఆమెను గుర్తించిన కొన్ని మీటర్ల దూరంలోనే తాళాలు గుర్తించినట్లు చెప్పారు. అయితే ఆమె చెట్టుకు కట్టేసుకుని ఎన్ని రోజులైందనే విషయం మాత్రం తెలియదని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news