అత్యాచారానికి గురైన బాలికతో నిందితుడి పెళ్లి.. హై కోర్టు స్పెషల్ బెయిల్

-

అత్యాచార బాధితురాలితో వివాహం జరిపించడానికి జైలులో ఉన్న నిందితుడికి ఉత్తరాఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మైనర్​ను వివాహం చేసుకునేందుకు 24 ఏళ్ల నిందితుడికి ఆరు వారాల స్వల్ప కాలిక బెయిల్ జారీ చేసింది. బాధితురాలిపై గతంలో అఘాయిత్యానికి పాల్పడ్డాడు నిందితుడు. ఆమె 2021 సెప్టెంబర్​లో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా బాధితురాలికి మైనారిటీ తీరడం వల్ల ఆమెను పెళ్లి చేసుకునెందుకు సిద్ధమయ్యాడు నిందితుడు. ఇందుకోసం అనుమతినివ్వాలని కోర్టును ఆశ్రయించాడు. విచారణ చేపట్టిన న్యాయస్థానం షరతులతో కూడిన ఆరు వారాల బెయిల్​ను మంజూరు చేసింది.

అసలేం జరిగిందంటే.. 2021 జనవరిలో నైనీతాల్​కు చెందిన 15 ఏళ్ల బాలికపై చంపావత్​ జిల్లాకు చెందిన యువకుడు అత్యాచారం చేసి తల్లిని చేశాడనే ఆరోపణలతో 2021 సెప్టెంబర్ 13న నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. ఈ క్రమంలో అదే ఏడాది సెప్టెంబరులో బాధిత గర్భం దాల్చి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. కాగా, ఘటన జరిగిన సమయానికి బాధితురాలు మైనర్​ అని ప్రస్తుతం ఆమెకు 18 ఏళ్లు నిండాయని, దీంతో ఇద్దరికి వివాహం జరిపించాలని ఇరు కుటుంబాలు నిశ్చయించాయి.

ఇందుకోసం నిందితుడు అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు జిల్లా కోర్టులో బెయిల్​ పిటిషన్​ దాఖలు చేశాడు. ఇరు వర్గాల వాదనలు వింటున్న సమయంలో బాధితురాలు 2021 జనవరిలో పరస్పర అంగీకారంతోనే నిందితుడితో శృంగారంలో పాల్గొన్నానని అందువల్లే తనకు గర్భం వచ్చిందని కోర్టుకు వివరించింది. ఇది విన్న జిల్లా కోర్టు బెయిల్​ అప్పీల్​ను తోసిపుచ్చింది. దీనిని సవాల్ చేస్తూ నిందితుడు హైకోర్టును ఆశ్రయించగా.. జనవరి 25న షరతులతో కూడిన ఆరు వారాల స్వల్పకాలిక బెయిల్​ను మంజూరు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news