హైవేపై అర్ధరాత్రి గ్రూప్‌ ఫైట్‌.. కార్లతో ఢీకొట్టి కర్రలతో కొట్టుకొన్న వీడియో వైరల్

-

కర్ణాటకలో కొందరు యువకులు రాత్రివేళ రోడ్డుపై హంగామా సృష్టించారు కార్లతో పరస్పరం ఢీ కొట్టుకుని కర్రలతో దాడులు చేసుకున్నారు. మే 18వ తేదీన ఉడుపి ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఉడుపి – మణిపాల్‌ హైవేపై రెండు కార్లలో వచ్చిన ఆరుగురు యువకులు వీరంగం సృష్టించారు. మొదట ఓ కారు వేగంగా వెనక్కి వచ్చి మరో వాహనాన్ని ఢీ కొట్టింది. అందులో నుంచి యువకులు దిగి కర్రలతో కొట్టుకున్నారు. ఈ క్రమంలోనే కర్ర పట్టుకున్న ఓ యువకుడిని మరో గ్రూప్‌నకు చెందిన కారు ఢీ కొనడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. సమీపంలోని అపార్ట్‌మెంట్‌ నుంచి ఈ తతంగాన్ని వీడియోలో రికార్డ్‌ చేశారు. కర్ణాటకకు చెందిన ఓ డాక్టర్‌ దీన్ని తన ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్ట్ చేస్తూ నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ వీడియో కాస్తా వైరల్‌ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేశామని, మరో నలుగురి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news