పెళ్లి పీటలెక్కిన ‘నేనింతే’ హీరోయిన్

-

ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈ మధ్యకాలంలో చాలా మంది టాలీవుడ్ తారలు పెళ్లి పీటలు ఎక్కారు.  ఇక తాజాగా మరో తార పెళ్లి పీటలు ఎక్కనుంది. రవితేజ ‘నేనింతే’ సినిమాలో నటించి మెప్పించిన హీరోయిన్ ఆదితి గౌతమ్ పెళ్లి చేసుకుంది.

ముంబైకి చెందిన వ్యాపారవేత్త మికాయిల్ పాల్కివాలాతో ఆమె ఏడడుగులు వేసింది. ఈ విషయాన్ని అదితి స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. కాగా నేనింతే తర్వాత అదితికి తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. వేదం, పక్కా కమర్షియల్ లో చిన్న పాత్రల్లో కనిపించింది. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news