ఫ్లైట్ లో రచ్చ చేసిన నేపాల్ దేశస్థుడిని అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు…

-

కొన్ని సార్లు ఫ్లైట్ లో విచిత్రకరమైన పరిస్థితులు జరుగుతుంటాయి. కొన్ని పనులను ఫ్లైట్ లో చేయకూడదని విమాన సిబ్బంది చెప్పినా ప్రయాణికులు వినకుండా హద్దు దాటి ప్రవర్తిస్తుంటారు. తాజాగా టోరెంటో నుండి ఢిల్లీకి వస్తున్న విమానంలో నేపాల్ కు చెందిన మహేష్ పండిట్ అనే ప్రయాణికుడు విమాన నియమ నిబంధనలను అతిక్రమించారు, తెలుస్తున్న సమాచారం ప్రకారం… మహేష్ పండిట్ టాయిలెట్ లో సిగరెట్ తాగాడు.. ఎవరికీ తెలియకుండా మానేజ్ చేద్దామని అనుకున్నాడు. కానీ విమాన సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించారు. వెంటనే సిబ్బంది మహేష్ పండిట్ ను మీరు రూల్ ను మీరారు అని అడుగుతుంటే.. వారిపై అడ్డ దిడ్డంగా వాదనకు దిగాడు. ఈ వాదంలో భాగంగా టాయిలెట్ డోర్ ను విరగ్గొట్టారు మహేష్. అంతే కాకుండా సిబ్బందిని మరియు అందులో ప్రయాణిస్తున్న వారిని సైతం తిట్టాడు.

ఈ ఘటనతో కోపం తెచ్చుకున్న సిబ్బంది ఢిల్లీ పోలీస్ లకు తెలియచేయడంతో వారు మహేష్ ను అరెస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news