విషాదం.. అమర్‌నాథ్‌ యాత్రలో ఒక్కరోజే గుండెపోటుతో ఐదుగురు మృతి

-

అమర్‌నాథ్‌ యాత్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఐదుగురు యాత్రికులు గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు. దీంతో దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయాల్లో జరిగే ఈ యాత్రకు వెళ్లిన వారిలో ఈ ఏడాది మృతి చెందిన వారి సంఖ్య 19కి చేరందని చెప్పారు. తాజాగా మృతి చెందిన ఐదుగురిలో అనంతనాగ్‌ జిల్లాలోని పెహల్గాం మార్గంలో ముగ్గురు.. గాందర్‌బల్‌ జిల్లా బల్తాల్‌ మార్గంలో ఇద్దరు ఉన్నట్టు తెలిపారు. మృతుల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు, మధ్యప్రదేశ్‌కు చెందిన మరో ఇద్దరు ఉండగా.. ఇంకో వ్యక్తి వివరాలను గుర్తించాల్సి ఉందని వెల్లడించారు.

అమర్‌నాథ్ యాత్రికులు, విధులకు వెళ్లిన భద్రతా సిబ్బంది మరణానికి కారణం అక్కడి అసాధారణ పరిస్థితులే అని అధికారులు చెబుతున్నారు. అధిక ఎత్తులో ఆక్సిజన్‌ గాఢత తక్కువగా ఉండటం వల్ల గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. మంగళవారం వరకు అమర్‌నాథ్‌ క్షేత్రాన్ని 1,37,353మంది యాత్రికులు సందర్శించారని అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news