భారత్ కు షాక్ ఇచ్చిన నేపాల్..!

-

నేపాల్లో దూరదర్శన్ మినహా భారత న్యూస్ చానెళ్ల ప్రసారాలను నిలిపేస్తున్నట్లు నేపాలీ కేబుల్ టివి ప్రొవైడర్లు గురువారం ఓ జాతీయ చానెల్ కు తెలిపారు. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రభుత్వ ఉత్తర్వులు ఇంతవరకు జారీ కాలేదు. అయితే భారత టీవీ చానెళ్లలో నేపాల్‌కు, ప్రధాని కేపీ ఓలీ శర్మకు వ్యతిరేకంగా ప్రసారమవుతున్న కార్యక్రమాలను నియంత్రించాలంటూ మాజీ డిప్యూటీ ప్రధాని నారాయణ కాజీ శ్రేష్ఠ నేడు ఉదయం ప్రకటించారు. ఆయన ఈ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే నేపాల్ కేబుల్ ఆపరేటర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. చైనా చేతులో కీలుబొమ్మగా మారిన నేపాల్.. చైనా మద్దతు చూసుకుని రెచ్చిపోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news