తెలంగాణలో కొత్తగా 1,410 కరోనా కేసులు..!

-

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే దీని ప్రభావం మరీ తీవ్రంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు. కాగా, తాజాగా.. గురువారం రాష్ట్రంలో కొత్తగా 1,410 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా,

ఏడుగురు మరణించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఒక్క GHMC పరిధిలోనే 918 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 30,946కి చేరుకుంది. ఇప్పటివరకు 18,192 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 331 మంది మరణించారు. ప్రస్తుతం 12,423 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news