నిర్భయ దోషులకు కొత్త డెత్ వారెంట్… ఉరి ఎప్పుడంటే…!

-

నిర్భయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ చేసింది పటియాల హౌస్ కోర్ట్. వారిని ఈ నెల 20 న ఉరి తీయాలని కోర్ట్ డెత్ వారెంట్ జారీ చేసింది. ఈ నెల 20 న వారిని తీయాలని కోర్ట్ ఆదేశించింది. ఈ నెల 20 ఉదయం 5;30 నిమిషాలకు వారిని ఉరి తీయనుంది. ఇప్పటికే వారు ఉరి శిక్ష నుంచి మూడు సార్లు తప్పించుకున్నారు. ఈ సారి వారికి ఉన్న అన్ని అవకాశాలు పూర్తి కావడం తో వారిని ఉరి తీయడం ఖాయంగా కనపడుతుంది.

నలుగురు దోషులకు న్యాయపరంగా, రాజ్యాంగ పరంగా ఉన్న అన్ని అవకాశాలు కూడా పూర్తి అయిపోయాయి. దీనితో ఇప్పుడు వాళ్ళు ఉరి నుంచి తప్పించుకునే అవకాశాలు ఇక లేవు. ఫిబ్రవరి 17 న కోర్ట్ వారిని ఉరి తీయడానికి డెత్ వారెంట్ ఇచ్చింది. మార్చ్ మూడున ఉరి తీయాలని చెప్పింది.

అయితే పవన్ కుమార్ గుప్తాకు సంబంధించిన డెత్ వారెంట్ పెండింగ్ లో ఉన్న నేపధ్యంలో వాయిదా వేసింది కోర్ట్. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వారిని ఉరి తీయవద్దని ఆదేశించింది. ఇక రాష్ట్రపతి క్షమాభిక్ష పిటీషన్ ని కొట్టేయడంతో వారిని ఉరి తీయడానికి డెత్ వారెంట్ జారి చేసింది. అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, ముఖేష్ సింగ్, వినయ్ శర్మ ను ఉరి తీయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news