బ్రేకింగ్ : ఈఎస్ఐ మందుల కొనుగోలులో కొత్త స్కాం

-

తెలంగాణా ఈ ఎస్ ఐ మందుల కొనుగోలులో మరో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. మందులు కొనుగోలు సరఫరా ఆధారంగా ఏసీబీ కొత్త కేసు నమోదు చేసింది. ఆరుగురు ఇళ్లలో ఏకకాలంలో ఏసీబీ ప్రస్తుతం సోదాలు చేస్తోంది.

ఈ ఎస్ ఐ మందుల కొనుగులు లో మరో స్కాంని గుర్తించిన ఏసీబీ అధికారులు కంచర్ల శ్రీ హరి బాబూ అలియాస్ బాబ్జీ , కంచర్ల సుజాత, కుక్కల కృప సాగర్ రెడ్డి, బండి వెంకటేశ్వర్లు, చెరుకూరి నాగరాజు, తింకశల వెంకటేష్ వంటి తొమ్మిది మంది ఇళ్ళలో ఏక కాలంలో సోదాలు జరుపుతున్నారు. ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవిక రాణి, జాయింట్ డైరెక్టర్ పద్మ అసిస్ట్oట్ డైరెక్టర్ కే వసంత ఇందిరల మీద కూడా ఈ విషయంలో మరో కేసు నమోదయింది. ప్రైవేటు సంస్థల నుంచి మందుల కోనుగోలు కోసం భారీగా ముడుపులు తీసుకున్నట్టు ఏసీబీ గుర్తించింది.

Read more RELATED
Recommended to you

Latest news