ఆ సాకేంతిక వస్తే.. టోల్‌వద్ద ఆగాల్సిన పని లేదు : కేంద్రమంత్రి

-

దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలపై త్వరలో కొత్త టోల్ వ్యవస్థ అందుబాటులోకి రానుందని కేంద్రం వెల్లడించింది. దానివల్ల ఇకమీదట టోల్ ప్లాజాల వద్ద వాహనాలను ఆపే అవసరం ఉండదని తెలిపింది. ఈ మేరకు బుధవారం కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి వికె సింగ్ మాట్లాడుతూ, కొత్త టెక్నాలజీ ద్వారా పనిచేసే ఈ టోల్ వ్యవస్థ ద్వారా ప్రయాణీకులు టోల్ ప్లాజాల వద్ద 30 సెకన్లు కూడా ఆగాల్సిన అవసరం ఉండదని ఆయన తెలిపారు.

VK Singh: Former army chief proves his mettle in political battlefield |  What you need to know - India Today

ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్రైయిల్స్ జరుగుతున్నాయని, సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఫాస్టాగ్‌ వ్యవస్థతో టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయాన్ని 47 సెకన్లకు తగ్గించగలిగామని.. ఆ సమయాన్ని 30 సెకన్ల కంటే తక్కువకు తగ్గించడాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు. ఉపగ్రహ, కెమెరాలు వంటి సాంకేతికతల ఆధారితంగా పనిచేసే ఈ నూతన టోల్‌ వ్యవస్థను ప్రస్తుతం దిల్లీ-మేరఠ్‌ ఎక్స్‌ప్రెస్‌వేలో పైలట్‌ ప్రాజెక్టు కింద పరీక్షిస్తున్నట్టుగా వీకే సింగ్ చెప్పుకొచ్చారు. మరోవైపు 2023 మార్చిలో ఢిల్లీలోసీసీఐ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కేంద్ర రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ ఇదే అంశంపై మాట్లాడారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news