బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో మరో ట్విస్ట్ !

-

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన బోయిన్పల్లి కిడ్నాప్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో తెర మీదకు మరో కొత్త పేరు వచ్చి చేరింది. ఈ కేసులో విజయవాడకు చెందిన సిద్ధార్థ కీలక సూత్రధారి అని గుర్తించారు పోలీసులు. ఈ కిడ్నాప్ కు సంబంధించి అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ కు సిద్ధార్థ మనుషులను సరఫరా చేసినట్లు గుర్తించారు. సిద్ధార్థ విజయవాడ కేంద్రంగా బౌన్సర్ లను ఈవెంట్లకు సప్లై చేసే వ్యక్తి అని గుర్తించారు పోలీసులు.

అఖిల ప్రియ, భార్గవ్ విజయవాడ, విశాఖపట్నం వైపు పర్యటనలకు వెళ్లినప్పుడు వీరికి సిద్ధార్థ పర్సనల్ గార్డ్ గా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు.  హైదరాబాద్ లో ఐటీ రైడ్స్ చేయడానికి తగినంత సిబ్బంది లేరని సాయం చేసేందుకు వెంటనే రావాలని భార్గవ్ కోరడంతో 15 మంది ని తీసుకుని సిద్ధార్థ హైదరాబాద్ వచ్చినట్లు సమాచారం. ముగ్గురు ని కిడ్నాప్ చేసి అఖిలప్రియ ఆదేశాల మేరకు మరలా వదిలేసి సిద్ధార్థ గ్యాంగ్ మళ్లీ వెనక్కి వెళ్ళినట్లు సమాచారం. సిద్ధార్థ గ్యాంగ్ లో మొత్తం 12 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న సిద్ధార్థ అలానే మరి కొందరి కోసం గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news