మదనపల్లె కూతుళ్ళ హత్య కేసులో మరో ట్విస్ట్..కరోనా పుట్టించారట !

-

చిత్తూరు జిల్లా మదనపల్లె ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులే పూర్తిస్థాయిలో ఆధ్యాత్మికంగా లీనమైపోయి మూఢత్వంలోకి వెళ్లిపోయారు. దెయ్యం పట్టిన మా కూతుళ్లను మేమే కొట్టి చంపామని నిందితులు వాంగ్మూలం ఇచ్చారు. వాళ్లు మళ్లీ బతుకుతారని మా ఇంట్లో కొన్ని రోజులు ఎన్నో మహిమలు జరిగాయి అని వారు పోలీసులకు చెప్పారు. ఆ మహిమలు మీకు అర్థం కావాలని మా ఇంట్లో దేవుళ్ళు ఉన్నారని వారు పోలీసులకు చెప్పారు.

పూజల తోనే చిన్నకూతురు ఆరోగ్య సమస్య తగ్గించామని వారంరోజులుగా అర్ధరాత్రి  బయట ఎన్నో పూజలు చేశామని అలాగే పది రోజుల నుంచి తిండి లేకుండానే ఉన్నామని పేర్కొన్నారు. కలియుగం అంతం అయిందని సత్య యుగం మొదలైంది అని వారు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. కరోనా వైరస్‌ చైనా నుంచి రాలేదంటూ పెద్ద పెద్దగా అరుస్తున్న పద్మజ… ఇక నేనే శివుడ్ని.. కరోనావైరస్ నా నుండే వచ్చిందని చెబుతోంది. ఇదంతా చూస్తూ పోలీసులే నివ్వెరపోయారు. సత్యలోకం అంటూ అదో పిచ్చిలోకంలోనే ఉంది కూతుళ్లను హత్య చేసిన తల్లి పద్మజ.  

Read more RELATED
Recommended to you

Latest news