ఆచార్య టీమ్ నుండి బిగ్ అప్ డేట్ – మెగా ఫ్యాన్స్ కి పండగే

-

టాలీవుడ్ మెగాస్టర్ చిరంజీవి ఎన్నో అంచ‌నాల న‌డుమ బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న మూవీ ఆచార్య(acharya). ఈ సినిమాపై ఇప్ప‌టికే అంచ‌నాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. దీని కోసం మెగా అభిమానులతో పాటు మిగ‌తా వారు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీలో చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలియ‌గానే ఫ్యాన్స్ అంచ‌నాలు ఆకాశాన్ని తాకాయి.

ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన చాలా పోస్టర్లు సినిమాపై హైప్ ను అమాంతం పెంచేశాయి. ఇందులో చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ ఎలా ఉంటార‌ని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్ప‌టికే ఇద్ద‌రి లుక్స్ మాసివ్‌గా ఆక‌ట్టుకున్నాయి. ఇక ఇప్పుడు తాజాగా ఆచార్య మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి అయిందని పేర్కొంటూ.. పోస్టర్ విడుదల చేసింది చిత్ర బృందం. ఇక ఈ పోస్టర్ లో చిరంజీవి మరియు రాంచరణ్ సూపర్ లుక్ లో కనిపిస్తూన్నారు. “అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆచార్య చిత్రం టాకీ పూర్తయింది. రెండు పాటల షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు.” అంటూ ట్వీట్ కూడా చేసింది చిత్ర బృందం. ఇక ఈ పోస్టర్ తో మెగా ఫాన్స్ లో కొత్త కొలహాలం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news