తెలంగాణలో విషాదం..అప్పగింతలకు ముందు విషం తాగి నవ వధువు ఆత్మహత్య !

-

ఇష్టంలేని పెళ్లి చేయడంతో.. అప్పగింతలకు ముందు విషం తాగి ఓ నవ వధువు సుసైడ్‌ చేసుకుంది. ఈ విషాద ఘటన మహబూబ్‌ నగర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. జిల్లాకు చెందిన గుజ్జల పద్మకు నలుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నాడు. పెద్ద కుమార్తె లక్ష్మి పదో తరగతి వరకు చదువుకుంది.

తాజాగా ఆమెకు అనంతపురం జిల్లాకు చెందిన మల్లేష్‌ తో పెళ్లి నిశ్చయమైంది. అయితే.. అంతదూరపు సంబంధం తనకు ఇష్టం లేదని లక్ష్మి తన తల్లికి చెప్పింది. అయినప్పటికీ వినకుండా శుక్రవారం ఆమెకు పెళ్లి చేశారు.

అయితే.. వివాహం ఇష్టం లేని లక్ష్మి సాయంత్రం అప్పగింతల సమయానికి విషయం తాగి ఆత్మహత్యానికి పాల్పడింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో అప్పటి వరకు పెళ్లితో కలకల లాడిన పెళ్లింట విషాదం అలుముకుంది. దీనిపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news