పెళ్లై నెల కూడా కాలేదు.. మరిదితో వదిన రాసలీలలు !

-

ఉత్తర ప్రదేశ్‌ లో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి అయిన 20 రోజులకే మరిదితో.. అక్రమ సంబంధం పెట్టుకుని.. చివరికీ అతనితో జంప్‌ అయింది ఓ మహిళ. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. యూపీలోని పురాన్‌ పూర్‌ కొత్వాలి ప్రాంతంలోని ఒక గ్రామానికి చెందిన ఓ యువకుడికి.. పిలిబిత్‌కు చెందిన యువతితో పెళ్లి జరిగింది. 20 రోజుల క్రితమే అంగరంగ వైభవంగా పెళ్లి వేడుకను నిర్వహించారు.

పెళ్లి ఘనంగా జరగడంతో.. కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా ఉన్నారు. బంధువులు, చుట్టుపక్కల స్థానికులంతా నూతన వధూవరులనున ఆశీర్వదించారు. అయితే.. పెళ్లి అయిన 20 రోజులకే కొత్త కోడలు విశ్వరూపం చూపించింది. ఎవరూ ఊహించని విధంగా.. అదే కుటుంబానికి చెందిన.. వరుసకు మరిది అయ్యే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది.

భర్తకు తెలియకుండా.. అతనితో రాసలీలలు కొనసాగించింది. అయితే.. తమ రాసలీలలకు ఎవరూ అడ్డుగా ఉండకూడదని.. ఇంట్లో నుంచి జంప్‌ అయింది ఆ జంట. అయితే.. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న ఆ కుటుంబం.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. వారి కోసం దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news