కరోనాతో సినిమాలు వాయిదా..హీరో నిఖీల్‌ సంచలన ట్వీట్‌

-

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి.. చిత్ర పరిశ్రమను కుదేలు చేస్తోంది. కరోనా నేపథ్యంలో.. సినిమాలు విడుదల కాక… చాలా మంది నిర్మాతలు, థియేటర్ ఓనర్లు నష్టపోతున్నారు. సంక్రాంతికి పెద్ద సినిమాలు అయిన ఆర్‌ఆర్‌ఆర్‌, రాధేశ్యామ్‌, బీమ్లా నాయక్‌ లాంటి సినిమాలు విడుదల అవుతాయని అనుకున్నా.. కరోనా కారణంగా అవి వాయిదా పడ్డాయి. అయితే.. తాజాగా టాలీవుడ్‌ హీరో నిఖిల్‌.. సినిమాలు వాయిదా పడటంపై ఆందోళన వ్యక్తం చేశాడు.

కరోనా మహమ్మారి ప్రభావం తమ కెరీర్లపై బాగా పడుతోందని.. నిఖీల్‌ ట్వీట చేశారు. అర్జున్‌ సురవరం సినిమా విజయవంతమైన అనంతరం.. తాను నాలుగు సినిమాలకు ఒప్పుకున్నానని… ఆ నాలుగు సినిమాల కథలు తనకు బాగా నచ్చాయని స్పష్టం చేశాడు. అయితే.. వాటి విడుదల తేదీలన్నీ తమ నియంత్రణలో లేకుండా పోయాయని నిఖిల్‌ చెప్పాడు. ఈ పరిస్థితుల నుంచి బయట పడేయాలని.. సినిమాలను అనుకున్న సమయానికి విడుదల చేసేలా చూడాలని దేవుడిని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చాడు నిఖిల్‌. నిఖిల్‌ చేసిన ఈ ట్వీట్‌..ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news