సూసైడ్ చేసుకున్న టీడీపీ నేత కుటుంబాన్ని పరామర్శించనున్న నిమ్మగడ్డ ?

-

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ముందుగా  అనుకున్న షెడ్యూల్ లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి అని తెలుస్తోంది..ఈరోజు జగ్గంపేట మండలం లో ఉన్న గొల్లలగుంట గ్రామానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. టిడిపి సర్పంచ్ అభ్యర్థి భర్త శ్రీనివాస్ రెడ్డి నిన్న ఆత్మహత్య చేసుకుని చనిపోయిన సంగతి తెలిసిందే.

దీంతో ఆయన ఈ గ్రామానికి వెడుతున్నారు. సదరు కుటుంబాన్ని కూడా పరామర్శించే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతకు ముందు విశాఖపట్నం జిల్లాలో మీడియాతో మాట్లాడిన నిమ్మగడ్డ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. రాజ్యాంగం చెప్పిందే ఎన్నికల కమిషన్ కూడా చెబుతోందన్న ఆయన ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు మరో వ్యవస్థ అవసరమని అన్నారు. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ సమ దృష్టితో చూడాలని ఆయన పేర్కొన్నారు. స్వీయ నియంత్రణకు కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news