నిమ్స్ ఆస్పత్రిలో పనిచేసే యువతి ఆత్మహత్య..మానసిక ఒత్తిడి తట్టుకోలేక !

-

నిమ్స్ హాస్పిటల్లో విధుల వ్యవహారంలో మానసిక ఒత్తిడి తట్టుకోలేక గురువారం అర్థరాత్రి తన ఇంటిలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నిమ్స్ లో రేడియాలజి విభాగంలో పని చేసే యువతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆ విభాగము లోని ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటన వివరాల్లోకి వెళితే…మృతురాలు.. దువ్వసి సరస్వతి.( తండ్రి యాదయ్య. ఆర్టీసీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి చెందిన సరస్వతి ) ల్యాబ్ టెక్నీషియన్,నిమ్స్ రేడియాలజి విభాగంలో పనిచేస్తుంది.. పంజాగుట్టలోని బాలాపూర్ బస్తి లో నివాసం ఉంటున్న సరస్వతి…..ఉన్నతాధికారులు వీధుల విషయంలో వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఆమె తమ్ముడు సాయికిరణ్ ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు…మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news