మోడీ తెలంగాణలో పోటీ చేస్తే.. ఓడిస్తాం – తెలంగాణ మంత్రి

-

గత నాలుగు రోజుల నుంచి ప్రధాని నరేంద్ర మోడీపై వార్త వైరల్ అవుతుంది. ప్రధాని మోడీ తెలంగాణలో పోటీ చేస్తారని ఈ వార్త సారాంశం. అయితే దీనిపై తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. మోడీ.. తెలంగాణలో ఎక్కడ పోటీ చేసిన కచ్చితంగా ఓడిస్తామని వెల్లడించారు.

మోడీ నిజంగానే తెలంగాణ పోటీ చేయాలనుకుంటే స్వాగతిస్తున్నామని… కానీ ఇక్కడ పోటీ చేస్తే ఆయన ఓటమి ఖాయం అన్నారు. తెలంగాణలో ఓడించి మోడీని ఇంటికి పంపుతామని హెచ్చరించాడు. ప్రతిపక్షాలను వేధిస్తున్న మోడీ కి ఈసారి గుణపాఠం తప్పదని వార్నింగ్ ఇచ్చాడు. తెలంగాణకు నిధులు ఇవ్వకుండా పైశాచికంగా వ్యవహరిస్తున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. అటు మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా దీనిపై స్పందించారు. తెలంగాణలో ప్రధాని మోడీ పోటీ చేస్తే ఖచ్చితంగా ఓడిస్తామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news